Srikaram News
క్రైమ్

నర్సింహా స్వామి ఆలయంలో దొంగతనం

అభరణాలను ఎత్తుకెళ్లిన దొంగలు
– ఘటన స్థలాన్ని పరిశీలించిన ఏఎస్పీ అవినాష్ కుమార్, సీఐ గోపినాథ్.                                  భైంసా (శ్రీకరం న్యూస్) : రెవెన్యూ డివిజన్ కేంద్రమైన భైంసాలోని ప్రసిద్ధ నర్సింహా స్వామి ఆలయంలో ఆదివారం వేకువ జామున దొంగతనం జరిగింది. ఆలయంలోకి ప్రవేశించిన దొంగలు స్వామి వారి గర్భగుడి ప్రవేశ మార్గానికి గల తాళాలను పగులగొట్టి లోనికి వెళ్లి చోరికి పాల్పడ్డారు. నర్సింహా స్వామికి అలంకరించిన 3.5 కిలోల వెండి మకర తోరణంతో పాటు 29 తులాల కిరీటాన్ని దొంగలు అపహరించుకుపోయారు. అంతే కాకుండా గర్భగుడి ముందర గల హుండిని కింది భాగం నుంచి పగుల గొట్టి భక్తులు సమర్పించిన నగదును ఎత్తుకెళ్లిపోయారు. ఉదయం 9గంటల్ ప్రాంతంలో సంబంధిత చోరి ఘటన వెలుగు చూసింది. ఘటన స్థలాన్ని భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్, టౌన్ సీఐ గోపినాథ్ లు పరిశీలించారు. ఆలయ పూజారులు, నిర్వాహాకులతో మాట్లాడి చోరి ఘటన వివరాలు తెలుసుకున్నారు.

0Shares

Related posts

భారీ వర్షం నేపథ్యంలో రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు

Srikaram News

స్కూటి డిక్కీ నుంచి రూ.5 లక్షల అవహరణ

Srikaram News

నాగదేవత ఆలయ చోరి కేసు చేదించిన పోలీసులకు రివార్డులు

Srikaram News

ఓవైసీ నగర్‌లో పోలీసుల మెరుపు దాడి – బెట్టింగ్ రాయుడు పట్టివేత

Srikaram News

బాసర గోదావరి నదిలో మునిగి ఐదుగురు యువకుల మృతి

Srikaram News

ఏరియా ఆసుపత్రి ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ పిట్ల శ్రీనివాస్ ఆకస్మిక మృతి

Srikaram News

Leave a Comment