Srikaram News
క్రైమ్తెలంగాణ

ఆర్టీసీ బస్సు ఢీ కొని చికిత్స పోందుతూ వృద్ధుని మృతి

ముథోల్ న్యూ జీపీ సమీపంలో ఘటన

భైంసా (శ్రీకరం న్యూస్) ; నియోజకవర్గ కేంద్రమైన ముథోల్ లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డా వృద్ధుడు ఒకరు చికిత్స పోందుతూ సోమవారం వేకువ జామున మృతి చెందాడు. ముథోల్ నయాబాదీ కాలనీకి చెందిన సృంగారి దత్త (65) ఆదివారం ఉదయం ఇంటి నుంచి బస్టాండ్ కు వెళ్తుండగా, కొత్త గ్రామ పంచాయతీ వద్ద భైంసా డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. క్షతగాత్రుడిని ముందుగా భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స నిర్వహించిన అనంతరం మెరుగైన వైద్య సేవల కోసం గాను నిజామాబాద్ లోని ఒక ప్రైవేటు హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పోందుతున్న వృద్ధుడు దత్త సోమవారం వేకువ జామున వేళలో మృతి చెందాడు. మృతుని కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముథోల్ ఎస్సై కే. సంజీవ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

0Shares

Related posts

దిల్లీ పీఠ కైవసంతో భైంసాలో బీజేపీ విజయోత్సవ సంబరాలు

Srikaram News

ప్రాణమున్నంత వరకు బీజేపీలోనే కొనసాగుతా

Srikaram News

సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ

Srikaram News

గడ్డేన్న వాగు ప్రాజెక్ట్ వరద గేట్లు నుంచి మరింత పెరిగిన అవుట్ ఫ్లో

Srikaram News

రోడ్డు ప్రమాదంలో ముథోల్ ఆశ్రమ పాఠశాల పీఈటీ ఆడే నరేష్ మృతి

Srikaram News

భైంసా మీదుగా పాలజ్ కు నిలిచిన రాకపోకలు

Srikaram News

Leave a Comment