Srikaram News
క్రైమ్తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో విఠాపూర్ వాసి దుర్మరణం

* వానల్ పాడ్ గ్రామం వద్ద ప్రమాదం

– ట్రాక్టర్, బైక్ ఢీకొట్టుకోవడముతో ఘటన
– ప్రమాద స్థలిలోనే మృతి

బైంసా, (శ్రీకరం న్యూస్): మండలంలోని వానల్ పాడ్ గ్రామం వద్ద గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో కుంటాల మండలంలోని విఠాపూర్ గ్రామానికి చెందిన ఇంద్రాసేనా రెడ్డి (38) అనే వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. స్వంత పనుల నిమితం భైంసాకు వచ్చిన ఇంద్రాసేనా రెడ్డి తిరిగి స్వగ్రామానికి బైక్ పై వెలుతుండగా వానల్పాడ్ గ్రామం వద్ద ప్రమాదం బారిన పడ్డాడు. పెండ్ పెల్లి గ్రామం నుంచి జాతీయ రహాదారి మార్గం మీదుగా వానల్పాడ్ గ్రామం లోపలికి వ స్తున్న ట్రాక్టర్, భైంసా నుంచి విఠాపూర్ కు వెలుతున్న ఇంద్రాసేనా రెడ్డి బైక్ ఢీకొట్టుకోవడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనలో తీవ్ర గాయాలపాలైన ఇంద్రాసేనా రెడ్డి ప్రమాద స్థలిలోనే మృత్యువాత పడ్డాడు. బాధిత కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బైంసా రూరల్ ఎస్ఐ మాలిక్ కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు.

0Shares

Related posts

మున్నురుకాపులంతా సంఘటితంగా సాగాలి…. సత్ఫలితాలు సాదించాలి…

Srikaram News

రాజాసింగ్ మద్దతు పోస్టులతో హీటెక్కిన సోషల్ మీడియా

Srikaram News

బైంసా, ముథోల్ ఆత్మ కమిటీల ఖరారు

Srikaram News

ఆర్టీసీ బస్సు ఢీ కొని చికిత్స పోందుతూ వృద్ధుని మృతి

Srikaram News

గడ్డేన్న వాగు ప్రాజెక్టులోకి మరింతగా పెరిగిన ఇన్ ఫ్లో

Srikaram News

గడ్డెన్న ప్రాజెక్ట్ నాలుగో వరద గేటు ఎత్తివేత

Srikaram News

Leave a Comment