Srikaram News
తెలంగాణరాజకీయం

బైంసా, ముథోల్ ఆత్మ కమిటీల ఖరారు

– భైంసాకు సిద్ధం వివేకానంద(కుభీర్)
– ముథోల్ కు గన్ను నర్సారెడ్డి (పుస్పూర్)
– వేణుగోపాలచారి, నారాయణరావ్ పాటిల్ వర్గీయులకు దక్కిన పీఠాలు

భైంసా, (శ్రీకరం న్యూస్): సంవత్సర కాలంగా వాయిదా పడుతూ వస్తున్న భైంసా, ముథోల్ ఆత్మ కమిటీలు ఎట్టకేలకు ఖరారు అయి నట్లుగా తెలిసింది. భైంసా ఆత్మ కమిటీ చైర్మెన్ గా ముథోల్ మాజీ ఎమ్మెల్యే బోస్లే నారాయణరావ్ పాటిల్ ప్రధాన అనుచరు డైన కుభీర్ గ్రామానికి చెందిన సిద్ధం వివేకానంద నియమితులైనట్లుగా తెలిసింది. ఇక ముథోల్ ఆత్మ కమిటీ చైర్మెన్ గా మాజీ కేంద్ర మంత్రి వర్యులు డా. సముద్రాల వేణుగోపాల చారికి నమ్మిన బంటుగానున్న లోకేశ్వరం మండలం పుస్పూర్ గ్రామానికి చెందిన గన్ను నర్సారెడ్డి నియమితులైనట్లుగా సమాచారం. జిల్లా ఇంచార్జీ మంత్రి సీతక్క సిఫారసు మేరకు వ్యవసాయ శాఖాధికారులు భైంసా, ముథోల్ ఆత్మ కమిటీల నియమాకపు జాబితాను ఉ న్నతాధికారుల అనుమతి కోసం నివేదించినట్లుగా తెలి సింది . మంగళ, బుధవారాల్లో కమిటీల నియమాకపు ఉత్తర్వులు వెలువడనున్నట్లుగా తెలిసింది. ఒక్కో ఆత్మ కమిటీలో చైర్మెన్ తో పాటు 24 మంది డైరెక్టర్లు, ఏడీఏ, బ్లాక్ టెక్నాలజీ మేనేజర్ తో కలిసి ఒక్కో కమిటీలో మొత్తం 27 మంది సభ్యులుంటారు. క మిటీల పదవీకాలం రెండు సంవత్సరాల పాటు కొనసాగనుంది.

0Shares

Related posts

వరద విపత్తులో మహిళా ఉన్నతాధికారులిద్దరి సాహసోపేత సేవలు

Srikaram News

ఓవైసీ నగర్‌లో పోలీసుల మెరుపు దాడి – బెట్టింగ్ రాయుడు పట్టివేత

Srikaram News

వివేకానంద అవాసానికి ప్రభుత్వ ఉపాద్యాయుడు తొలి వేతనం విరాళం

Srikaram News

బిగ్ బ్రేకింగ్ న్యూస్ : గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్

Srikaram News

ఇన్ స్పైర్ మేళాలో సత్తా చాటిన బైంసా కేజీబీవీ విద్యార్థులు

Srikaram News

బైంసా – పార్డీ రోడ్డు మార్గంలో నిలిచిన రాకపోకలు

Srikaram News

Leave a Comment