Srikaram News
క్రైమ్తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో ముథోల్ ఆశ్రమ పాఠశాల పీఈటీ ఆడే నరేష్ మృతి

– భైంసా సేవాలాల్ చౌక్ సమీపంలో ఘటన
– బస్సు–భైక్ ఢీ కొట్టుకోవడంతో ప్రమాదం

భైంసా (శ్రీకరం న్యూస్) ; భైంసా–బాసర ప్రధాన రహదారిలోని పట్టణ సరిహద్దు ప్రాంతంలో గల సేవాలాల్ చౌక్ సమీపంలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కుభీర్ మండలం సిర్పెల్లి తాండకు చెందిన ఆడే నరేష్ (45) మృతి చెందాడు. ఆడే ముథోల్ నియోజకవర్గ కేంద్రంలో ఆశ్రమ పాఠశాలలో వ్యాయమ ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్నాడు. భైంసాలోని ఖాన్ ఆటో నగర్ వైపు నుంచి ముథోల్ ఆశ్రమ పాఠశాలకు ద్విచక్రవాహానంపై వెళ్తున్న ఆడే నరేష్, నిజామాబాద్ వైపు నుంచి భైంసాకు వస్తున్న బస్సు సేవాలాల్ చౌక్ సమీపంలో ఢీ కొట్టుకోవడంతో ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో అపస్మారక స్థితికి చేరుకున్న వ్యాయమ ఉపాధ్యాయుడు ఆడే నరేష్ ను 108 అంబులెన్స్ లో భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లుగా తెలిసింది. సమాచారం తెలుసుకున్న పట్టణ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

0Shares

Related posts

స్కూటి డిక్కీ నుంచి రూ.5 లక్షల అవహరణ

Srikaram News

మరో గంటన్నర వ్యవదిలో బైంసాకు చేరుకోనున్న యాత్రీకుల బృందం

Srikaram News

వృంధావన్ క్షేత్రం నుంచి బైంసాకు బయలుదేరిన యాత్రీకుల బృందం

Srikaram News

బైంసా, ముథోల్ ఆత్మ కమిటీల ఖరారు

Srikaram News

టీజీఎల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం

Srikaram News

భైంసా మీదుగా పాలజ్ కు నిలిచిన రాకపోకలు

Srikaram News

Leave a Comment