Srikaram News
తెలంగాణ

భైంసా గడ్డెన్న ప్రాజెక్టు వరద గేట్ల మూసివేత

4500 క్యూసెక్కులకు తగ్గిన ఇన్ ఫ్లో
– వరద గేట్ల ద్వారా నీటి విడుదలను నిలిపివేసిన అధికారులు

భైంసా (శ్రీకరం న్యూస్) ; ఎగువ ప్రాంతంలో వర్షాలు తగ్గిన నేపథ్యంలో గడ్డెన్న ప్రాజెక్టులోకి వరద నీటి చేరిక తగ్గుముఖం పట్టింది. ఉదయం వేళలో 13900 క్యూసెక్కులుగా ఉన్న ఇన్ ఫ్లో 9.30 గంటల సమయానికి 4500 క్యూసెక్కులకు తగ్గిపోయింది. ఈ క్రమంలో ఉదయం వేళలో 5 వరద గేట్లను ఎత్తివేసి సుద్దవాగులోకి 13900 క్యూసెక్కుల నీటిని వదిలిన అధికారులు ఇన్ ఫ్లో 4వేలకు తగ్గడంతో 5 వరద గేట్లను ఒక్కోక్కటిగా మూసి వేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 4500 ఇన్ ఫ్లో కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 358.7 మీటర్లు ఉండగా.. ప్రస్తుతం నీటి మట్టం 357.1 మీటర్లుగా ఉంది.

0Shares

Related posts

భారీ వర్షాల కారణంగా రేపు విద్యాసంస్థలకు సెలవు

Srikaram News

భైంసాలో మృతదేహ భద్రపాటుకు ఫ్రీజర్ సేవలు

Srikaram News

కేటీఆర్ తో బైంసా ఏఎంసీ మాజీ చైర్మెన్ పిప్పెరవార్ కృష్ణ బేటి

Srikaram News

నిండుకుండలా గడ్డన్న వాగు ప్రాజెక్ట్

Srikaram News

వాటర్ ఫాల్ లో గల్లంతై వైమానిక జవాన్ మృతి

Srikaram News

పర్యావరణ హితం.. భైంసా ఆర్యవైశ్య మండలి అభిమతం

Srikaram News

Leave a Comment