Srikaram News
క్రైమ్తెలంగాణ

బాసరలో గోదావరి ముంపు ప్రాంతాల్లో ఎస్పీ డా. జానకి షర్మిల పర్యటన

– ముంపులో పలు లాడ్జీలు, వ్యాపార సంస్థలు
– ట్రాక్టర్‌పై వెళ్లి ముంపు ప్రాంతాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ
– ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు

భైంసా (శ్రీకరం న్యూస్ ) బాసరలో గోదావరి నది ఉధృతి పెరగడంతో తీర ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. గోదావరి నీరు ఎగసిపడడంతో పలు లాడ్జీలు, వ్యాపార సంస్థలు జలమయం కాగా, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల స్వయంగా ట్రాక్టర్‌పై ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ముంపు పరిస్థితులను సమీక్షించి, బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలను చేపట్టారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, అధికార యంత్రాంగం అన్ని రకాల సహాయక చర్యలకు సిద్ధంగా ఉందని ఎస్పీ భరోసా ఇచ్చారు. రక్షణ చర్యల్లో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ బృందాలు భాగస్వామ్యమై సహాయ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయని వెల్లడించారు. గోదావరి ఉధృతి ఇంకా కొనసాగుతుండటంతో తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల సూచించారు.

0Shares

Related posts

భారీ వర్షాల కారణంగా రేపు విద్యాసంస్థలకు సెలవు

Srikaram News

వృంధావన్ క్షేత్రం నుంచి బైంసాకు బయలుదేరిన యాత్రీకుల బృందం

Srikaram News

నిర్మల్ జిల్లాను కుమ్మేసిన వరుణుడు

Srikaram News

పబ్జీ గేమ్ కు బానిసగా మారిన విద్యార్థి ఆత్మహత్య

Srikaram News

తేనెటీగల దాడిలో 8 మంది రైతులకు అస్వస్థత

Srikaram News

రోడ్డు ప్రమాదంలో నిర్మల్ యువ ఫోటోగ్రాఫర్ మృత్యువాత

Srikaram News

Leave a Comment