Srikaram News
క్రైమ్

నర్సింహా స్వామి ఆలయంలో దొంగతనం

అభరణాలను ఎత్తుకెళ్లిన దొంగలు
– ఘటన స్థలాన్ని పరిశీలించిన ఏఎస్పీ అవినాష్ కుమార్, సీఐ గోపినాథ్.                                  భైంసా (శ్రీకరం న్యూస్) : రెవెన్యూ డివిజన్ కేంద్రమైన భైంసాలోని ప్రసిద్ధ నర్సింహా స్వామి ఆలయంలో ఆదివారం వేకువ జామున దొంగతనం జరిగింది. ఆలయంలోకి ప్రవేశించిన దొంగలు స్వామి వారి గర్భగుడి ప్రవేశ మార్గానికి గల తాళాలను పగులగొట్టి లోనికి వెళ్లి చోరికి పాల్పడ్డారు. నర్సింహా స్వామికి అలంకరించిన 3.5 కిలోల వెండి మకర తోరణంతో పాటు 29 తులాల కిరీటాన్ని దొంగలు అపహరించుకుపోయారు. అంతే కాకుండా గర్భగుడి ముందర గల హుండిని కింది భాగం నుంచి పగుల గొట్టి భక్తులు సమర్పించిన నగదును ఎత్తుకెళ్లిపోయారు. ఉదయం 9గంటల్ ప్రాంతంలో సంబంధిత చోరి ఘటన వెలుగు చూసింది. ఘటన స్థలాన్ని భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్, టౌన్ సీఐ గోపినాథ్ లు పరిశీలించారు. ఆలయ పూజారులు, నిర్వాహాకులతో మాట్లాడి చోరి ఘటన వివరాలు తెలుసుకున్నారు.

0Shares

Related posts

నాగదేవత ఆలయంలో చోరికి పాల్పడ్డ దొంగల పట్టివేత

Srikaram News

నాగదేవత ఆలయ చోరి కేసు చేదించిన పోలీసులకు రివార్డులు

Srikaram News

రోడ్డు ప్రమాదంలో విఠాపూర్ వాసి దుర్మరణం

Srikaram News

భైంసా డివిజన్ యాత్రీకుల బస్సుకు అగ్ని ప్రమాదం

Srikaram News

మృతదేహల తరలింపుకు అంబులెన్స్ సమకూర్చిన భైంసా రాజస్థానీయులు

Srikaram News

షార్ట్ సర్క్యూట్ తో ల్యాండ్రీ షాప్ లో అగ్ని ప్రమాదం

Srikaram News

Leave a Comment