Srikaram News
క్రైమ్తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో స్వర్ణకార సంఘ జిల్లా మాజీ అధ్యక్షుడు కలికోట రాములుకు తీవ్ర గాయాలు

@ బైక్ పై వెలుతుండగా వెనుక నుంచి ఢీ కొట్టిన అర్టీసీ బస్సు
@ తల, భుజానికి తీవ్ర గాయాలు
@ ఏరియా ఆసుపత్రిలో చికిత్స

బైంసా, (శ్రీకరం న్యూస్): స్వర్ణకార సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు కలికోట రాములు (70) రోడ్డు ప్రమాదం బారిన పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. మంగళవారం ఉదయం వేళలో వ్యక్తిగత పనుల నిమిత్తం బైంసా నుంచి మాటేగామ్ వైపు బైక్ పై వెలుతుండగా ఘటన చోటు చేసుకుంది. రోడ్డు మార్గంలోని ఎస్ఆర్ మోటార్స్ వైపు మరల తున్న కలికోట రాములు బైక్ ను వెనుక వైపు నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. బస్సు ఢీ కొట్టడంతో కలికోట రాములు బైక్ పై నుంచి కింద పడటంతో తల, భుజానికి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడి ప్రాంత వాసులు వెంటనే స్పందించి క్షతగాత్రుడిని వైద్య సేవల నిమిత్తం బైంసా ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్సలు నిర్వహింప చేశారు. ఆర్టీసీ బైంసా బస్సు డిపో అధికారులు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు కలికోట రాములును పరామర్శించి ప్రమాద ఘటన వివరాలు, కారణాలు అడిగి తెలుసుకున్నారు.

0Shares

Related posts

వైకుంఠ రథ్ వాహన డ్రైవర్ విఠలన్న మృతి

Srikaram News

మాజీ డీసీసీ అధ్యక్షుడు దిగంబర్ మాశెట్టివార్ కన్నుమూత

Srikaram News

_అనారోగ్యంతో తాజా మాజీ మున్సిపల్ కౌన్సిలర్ వడ్నపు రాజేశ్వర్ మృతి_

Srikaram News

బీడీపీఎల్ క్రికెట్ టౌర్ని విజేతగా మణికంఠ వారియర్స్

Srikaram News

అత్యవసర రక్తదాత గంగా ప్రసాద్

Srikaram News

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రలోభాల పర్వం

Srikaram News

Leave a Comment