Srikaram News
తెలంగాణ

ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా జాతీయ రహదారిపై రాస్తారోకో

• ఉదయం 10 గంటల నుంచి స్తంభించిన రాకపోకలు

• కల్లూరు నుంచి కుంటాల మీదుగా వాహనాల దారి మల్లింపు

బైంసా, (శ్రీకరం న్యూస్) : దిలావర్ పూర్ మండలంలో నిర్మిస్తున్న ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా అక్కడి ప్రాంత వాసులు మంగళవారం రోడ్డెక్కారు. ఉదయం వేళ నుంచి జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టి ట్రాఫిక్ వ్యవస్థను స్తంభింపజేశారు. ఆందోళన కారుల రాస్తారోకోతో జాతీయ రహదారిపై కిలో మీటర్ల మేర వాహనాలు వాహనాలు నిలిచి పోయాయి. గత కొంత కాలంగా వివిధ రూపాల్లో ఆందోళనలు, నిరసనలు చేపడుతున్న అక్కడి ప్రాంత వాసులు ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడాన్ని నిరసిస్తూ రోడ్డెక్కారు. ఆందోళన కారులు ఉదయం 10 గంటల నుంచి జాతీయ రహదారి మార్గంలోనే బైటాయించి ఉన్నారు. ప్రభుత్వ అధికారులు, పోలీసు అధికారులు సముదాయిస్తున్నప్పటికి ఆం దోళన కారులు తగ్గేదేలే అన్న రీతిలో రాస్తారోకోను కొనసాగిస్తున్నారు.

*కల్లూరు మీదుగా వాహనాల దారి మళ్లింపు*

భైంసా- నిర్మల్ జాతీయ రహదారి మార్గంలోని దిలావర్పూర్ వద్ద ఉదయం నుంచి రాస్తారోకో కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసు అధికారులు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే కుంటాల మండలం కల్లూరు నుంచి నిర్మల్ కు వాహనాల దారి మళ్లింపు చేపట్టారు. కల్లూరు, కుంటాల, గొల్లమాడ మీదుగా సిర్గాపూర్ నుంచి నిర్మల్ వరకు వాహనాలను దారి మళ్లించి రాకపోకలు కొనసాగేల చర్యలు తీసుకున్నారు. అయితే భారీ వాహనాలు మాత్రం కల్లూరు నుంచి వానల్పాడ్ వరకు రోడ్డుకు ఒక వైపున నిలిచిపోయి ఉన్నాయి.

0Shares

Related posts

మృతదేహల తరలింపుకు అంబులెన్స్ సమకూర్చిన భైంసా రాజస్థానీయులు

Srikaram News

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార పర్వంలో మార్గదర్శకంగా నిలుస్తున్న బైంసా బీజేపీ ఇంచార్జీలు

Srikaram News

రోడ్డు ప్రమాదంలో స్వర్ణకార సంఘ జిల్లా మాజీ అధ్యక్షుడు కలికోట రాములుకు తీవ్ర గాయాలు

Srikaram News

పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో కోటీశ్వరులు

Srikaram News

రోడ్డు ప్రమాదంలో మహాగాం గ్రామవాసి దుర్మరణం

Srikaram News

ప్రైవేట్ విద్యా సంస్థలోని ఉద్యోగులకు రూ.3 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తా

Srikaram News

Leave a Comment